సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’ టీఆర్ఎస్(TRS)లో గుబులు రేపుతోంది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) టీఆర్ఎస్, కేసీఆర్ ప్రస్తావన లేకుండానే ప్రసంగం ముగించారు. మోదీ తమను ఎలా విమర్శిస్తారా.. ఎలా కౌంటర్ ఇవ్వాలా? అని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు టీవీలకు అతుక్కపోగా.. మోదీ వారందరికీ గట్టి షాకే ఇచ్చారు. తన ప్రసంగంలో అభివృద్ధి మంత్రం పఠించిన ప్రధాని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గురించి అస్సలు పట్టించుకోలేదు. అయితే ఇదేదో అసందర్భంగా జరిగింది కాదని.. వ్యూహాత్మకంగానే మోదీ ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ కూడా మోదీ మౌనం వెనుక ఏదో ఉందని అనుమానిస్తోంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు వచ్చిన రోజే టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం, సీఎం కేసీఆర్.. మోదీ పాలనపై విరుచుకుపడటం, మోడీ మాత్రం తెలంగాణ గొప్పదనం గురించి మాత్రమే మాట్లాడటంతో ఏం జరుగుతుందోనని టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలోనే రాష్ట్రపతి ఎన్నికలు రావడం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరింత కాక రేపాయి.
విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్రచారంలో భాగంగా ఆయన నెల29వ తేదీన హైదరాబాద్ వస్తారని ఖరారు అయినప్పటికీ టీఆర్ఎస్ వాయిదా వేయించినట్లు సమాచారం. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఉండటంతో దానికి పోటీగా జులై 2న యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ వ్యూహాత్మంగా హైదరాబాద్ రప్పించింది. అంతేకాదు బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. కేసీఆర్ స్వయంగా యశ్వంత్ సిన్హాను ఆహ్వానించడంతో పాటు జలవిహార్ జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ విధానాలను కడిగిపారేశారు. మోదీకి 9 ప్రశ్నలు సంధించారు.
దీంతో బీజేపీ విజయ సంకల్ప సభలో కేసీఆర్ ప్రశ్నలన్నింటికీ మోదీ సమాధానాలు చెబుతారని అందరూ ఆసక్తిగా గమనించారు. అయితే తెలంగాణకు కేంద్రం రామగుండం ఎరువుల ప్యాక్టరీ పున: ప్రారంభించడం, 35వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వేల విస్తరణ కోసం రూ.3100కోట్లు,1080 కిలో మీటర్లు కొత్త రైల్వే లైన్లు, కరోనా సమయంలో ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, కేసీఆర్ని విమర్శించకుండా తెలంగాణ గొప్పదనం, ప్రజల పోరాట పటిమను వివరించారు. దీంతో తాము ఏదో ఊహిస్తే ఇంకేదో అయిందని టీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. మరోవైపు జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్ లాంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోడీ ప్రసంగించిన 27 నిమిషాల్లో కేసీఆర్ ప్రస్తావనే రాలేదు. దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉందని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.
విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్రచారంలో భాగంగా ఆయన నెల29వ తేదీన హైదరాబాద్ వస్తారని ఖరారు అయినప్పటికీ టీఆర్ఎస్ వాయిదా వేయించినట్లు సమాచారం. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఉండటంతో దానికి పోటీగా జులై 2న యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ వ్యూహాత్మంగా హైదరాబాద్ రప్పించింది. అంతేకాదు బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. కేసీఆర్ స్వయంగా యశ్వంత్ సిన్హాను ఆహ్వానించడంతో పాటు జలవిహార్ జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ విధానాలను కడిగిపారేశారు. మోదీకి 9 ప్రశ్నలు సంధించారు.
దీంతో బీజేపీ విజయ సంకల్ప సభలో కేసీఆర్ ప్రశ్నలన్నింటికీ మోదీ సమాధానాలు చెబుతారని అందరూ ఆసక్తిగా గమనించారు. అయితే తెలంగాణకు కేంద్రం రామగుండం ఎరువుల ప్యాక్టరీ పున: ప్రారంభించడం, 35వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వేల విస్తరణ కోసం రూ.3100కోట్లు,1080 కిలో మీటర్లు కొత్త రైల్వే లైన్లు, కరోనా సమయంలో ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, కేసీఆర్ని విమర్శించకుండా తెలంగాణ గొప్పదనం, ప్రజల పోరాట పటిమను వివరించారు. దీంతో తాము ఏదో ఊహిస్తే ఇంకేదో అయిందని టీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. మరోవైపు జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్ లాంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోడీ ప్రసంగించిన 27 నిమిషాల్లో కేసీఆర్ ప్రస్తావనే రాలేదు. దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉందని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.