యాప్నగరం

కరీంనగర్ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి

Karimnagar: తాజాగా మేయర్‌గా ఎంపికైన సునీల్‌ రావు వరుసగా నాలుగోసారి గెలుపొందారు. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రస్తుతం ఐదోసారి విజయం సాధించారు.

Samayam Telugu 11 Dec 2022, 9:42 am
కరీంనగర్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా సునీల్ రావును టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈయన 33వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచారు. డిప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపారాణిని ఎంపిక చేశారు. బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం 13 మంది బీజేపీ కార్పొరేటర్లు బయటికి వెళ్లిపోయారు.
Samayam Telugu ktr
కేటీఆర్


Also Read: టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న ఇతర నేతలు

తాజాగా మేయర్‌గా ఎంపికైన సునీల్‌ రావు వరుసగా నాలుగోసారి గెలుపొందారు. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రస్తుతం ఐదోసారి విజయం సాధించారు.

Also Read: లంచం ఇవ్వలేదని చెప్పులతో బాదుతూ.. మహిళా అధికారిణి హల్‌చల్!

కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 20, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 58 డివిజన్లకు ఈ నెల 24న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఈ నెల 27న వచ్చాయి. ఇందులో ఏకగ్రీవ స్థానాలతో కలుపుకొని టీఆర్ఎస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో ఏడుగురు సభ్యులు ఇప్పటికే మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

Also Read: కరోనా వైరస్ కలవరం.. ఫీవర్ ఆస్పత్రికి మరింత మంది..
Also Read: శుభవార్త.. రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్స ఉచితం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.