Ts Government Releases Directions For Covid Hospitals Dealing With Coronavirus Cases
కరోనా మృతుల అంత్యక్రియలు ఎలా? ఫ్యామిలీకి అనుమతి ఉందా? మార్గదర్శకాలివీ..
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఆ వ్యాధి సోకిన రోగులు లేదా చనిపోయిన వారి వ్యవహారంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనుసరించాల్సిన పద్ధతులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కొవిడ్ రోగులకు చికిత్స, చనిపోయిన వారి విషయంలో అన్ని ఆస్పత్రులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను పురపాలక శాఖ గురువారం వెలువరించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘‘కరోనా మృతదేహాల కోసం ఆయా ఆస్పత్రుల్లో ఒక గదిని ప్రత్యేకంగా కొవిడ్ మార్చురీగా సిద్ధం చేయాలి. కరోనా వ్యక్తి చనిపోయిన వ్యక్తి దేహాన్ని తరలించేందుకు ప్రతి ఆస్పత్రి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వీరంతా ఇతర విధులకు హాజరు కాకూడదు. మృత దేహం శానిటైజ్ చేశాక, ప్రత్యేకమైన బాడీ బ్యాగులో శ్మశానానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలి. ఈ తరలింపునకు కూడా ప్రత్యేక వాహనాలు లేదా ఆంబులెన్సులను కేటాయించాలి. కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించాలి. అంతకు మించి బంధువులెవరికీ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకూడదు.
Samayam Telugu9 Apr 2020, 7:26 pm
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఆ వ్యాధి సోకిన రోగులు లేదా చనిపోయిన వారి వ్యవహారంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనుసరించాల్సిన పద్ధతులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కొవిడ్ రోగులకు చికిత్స, చనిపోయిన వారి విషయంలో అన్ని ఆస్పత్రులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను పురపాలక శాఖ గురువారం వెలువరించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘‘కరోనా మృతదేహాల కోసం ఆయా ఆస్పత్రుల్లో ఒక గదిని ప్రత్యేకంగా కొవిడ్ మార్చురీగా సిద్ధం చేయాలి. కరోనా వ్యక్తి చనిపోయిన వ్యక్తి దేహాన్ని తరలించేందుకు ప్రతి ఆస్పత్రి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వీరంతా ఇతర విధులకు హాజరు కాకూడదు. మృత దేహం శానిటైజ్ చేశాక, ప్రత్యేకమైన బాడీ బ్యాగులో శ్మశానానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలి. ఈ తరలింపునకు కూడా ప్రత్యేక వాహనాలు లేదా ఆంబులెన్సులను కేటాయించాలి. కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించాలి. అంతకు మించి బంధువులెవరికీ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకూడదు.
మృత దేహాల ప్యాకింగ్ ఇలా..
ఒకవేళ కరోనా రోగి మృత దేహాలను భద్రపర్చాల్సి వస్తే, ఆయా ఆస్పత్రులే ఫ్రీజర్ బాక్సులను, రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మతపరమైన నమ్మకాల నేపథ్యంలో మృత దేహం ముక్కులు, చెవులు, నోటిలో విధిగా దూదిని ఉంచాలి. అనంతరం దేహాన్ని ప్లాస్టిక్ షీట్తో పూర్తిగా చుట్టేయాలి. దాని తర్వాత తెల్లని కాటన్ వస్త్రంతో చుట్టాలి. అనంతరం పీపీఈ కిట్లోని జిప్ ఉండే మందపాటి బ్యాగులో దేహాన్ని ఉంచి శ్మశానానికి తరలించాలి. ఇక మార్చురీని శుభ్రం (డిసిన్ఫెక్టెంట్) చేసేందుకు ఒకశాతం సోడియం హైపోక్టోరైట్ ఉన్న ద్రావణాన్ని గదిలోని అన్ని గోడలకు, నేలపైనా, కిటికీల్లో, వెంటిలేటర్లలో చల్లాలి. ఆ గదిలోపల ఉన్న సామగ్రిపై కూడా రోజుకు 5 సార్ల చొప్పున ఈ ద్రావణాన్ని చల్లాలి.
గాజు అద్దాల్లోంచే చూడాలి
ఇక కొవిడ్ రోగులకు ఉపయోగించే వైద్య సామగ్రిని, ఇతర వస్తువులను విధిగా ప్రత్యేక బ్యాగులో ఉంచి ప్రత్యేకమైన చోట్ల డిస్పోజల్ చేయాలి. వీటిని నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్ చేస్తున్నారా లేదా అని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుంటుంది. గాజు అద్దాల్లో ఉంచే కరోనా రోగిని బయటి నుంచి అద్దాల గుండా చూసేందుకు వారి కుటుంబసభ్యులకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి అనుమతించకూడదు. కరోనా రోగికి చికిత్స అందిస్తున్న వైద్యులు లేదా నర్సులు, కంపౌండర్లు నేరుగా రోగి కుటుంబసభ్యులను కలవకూడదు.
4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తరలింపు
కరోనా మృత దేహాలను ప్రత్యేకంగా రంగు వేసిన వాహనంలో మాత్రమే శ్మశానానికి తరలించాలి. ఇందులో ఫ్రీజర్ బాక్సులో ఎప్పుడూ 4 డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటేన్ చేయాలి. ప్రత్యేక రంగు వేసిన స్ట్రెచర్నే వాడాలి. ఆస్పత్రి నుంచి మృత దేహాన్ని శ్మశానానికి తరలించే క్రమంలో సిబ్బంది అనుభవం ఉన్నవారై ఉండాలి. వారు కచ్చితంగా పీపీఈ కిట్లు (ఎన్ 95 మాస్క్, సర్జికల్ క్యాప్, రక్షణ కళ్లద్దాలు, వాటర్ రెసిస్టెంట్ యాప్రాన్, సర్జికల్ గ్లౌజులు, బూట్లు, వాటికి ప్లాస్టిక్ కవర్లు, ఫేస్ షీల్టు) ధరించి ఉండాలి. ఈ నిబంధనలు అన్ని కచ్చితంగా పాటించేలా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలి.
ఇక శ్మశానంలో మృత దేహాన్ని ఖననం చేసే సమయంలో అనుమతించే ఐదుగురు కుటుంబ సభ్యులను 4 మీటర్ల దూరంలో ఆపేయాలి. ఆ సమయంలో వారికి ఐదు మాస్కులు, ఒక శానిటైజర్ బాటిల్ అందించాలి. మృత దేహాన్ని ఖననం చేసే ప్రదేశం చుట్టూ తాత్కాలికంగా ఒక తాడును కానీ, ఏదైనా బారీ కేడ్ను కానీ ఉంచాలి. దాని చుట్టూనే సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు చేసే ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఖననం అనంతరం కరోనా రోగి అస్థికలను ప్రత్యేకమైన బాక్సులో గ్లౌజులు ధరించిన వారు కుటుంబ సభ్యులకు అందించాలి. కరోనా రోగుల మృత దేహాలను ఖననం చేసే శ్మశానాన్ని తరచూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తూ ఉండాలి’’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.