యాప్నగరం

Rythu Bandhu 2022: గుడ్ న్యూస్.. నేటి నుంచే రైతుబంధు.. కొత్తగా 3.64 లక్షల మందికి కూడా

Rythu Bandhu Scheme: రైతులకు శుభవార్త.. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు ఇవ్వాళ్టి నుంచే ఖాతాల్లో పడబోతున్నాయి. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది.

Authored byRaj Kumar | Samayam Telugu 28 Jun 2022, 8:10 am
Rythu Bandhu Status 2022: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు నిధుల పంపిణీ ఇవ్వాళ్టి నుంచే మొదలవనుంది. మొత్తం 68,94,486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందనుంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల భూమి కొత్తగా రైతుబంధు జాబితాలో చేరింది.
Samayam Telugu Rythu Bandhu


యాసంగి సీజన్‌తో పోల్చితే 3.64 లక్షల మంది రైతులకు ఈ సారి కొత్తగా రైతుబంధు అందనుంది. రైతుబంధుకు సంబంధించి ఎకరాల వారీగా బిల్లుల జాబితాను వ్యవసాయశాఖ ఇప్పటికే ఆర్థిక శాఖకు అందించింది. తొలిరోజు ఎకరాలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. మంగళవారం మొత్తం 19.98 లక్షల మందికి రూ.586.65 కోట్లు పంపిణీ చేయనున్నారు. గత యాసంగి వరకు రైతుబంధు కింద రూ.50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్‌లో జమ చేయబోయే రూ.7,654.43 కోట్లను కలిపితే.. మొత్తంగా రైతుబంధు సాయం రూ.58,102 కోట్లకు చేరనుంది.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా వాటన్నింటినీ దాటుకొని రైతుల కోసం సీఎం కేసీఆర్‌ రైతుబంధు నిధులను మంజూరు చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులపై సీఎం కేసీఆర్‌కు గల ప్రేమకు ఇది నిదర్శనమని చెప్పారు. రైతుబంధు వార్తతో రైతుల్లో సంతోషం నెలకొందని తెలిపారు. ఈ సీజన్‌లో సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని వివరించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.