యాప్నగరం

Secretariat Demolition: సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగించిన హైకోర్ట్

తెలంగాణ సచివాలయ కూల్చివేతపై హైకోర్ట్ మళ్లీ స్టే పొడిగించింది. జులై 15 వరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది.

Samayam Telugu 13 Jul 2020, 3:26 pm
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు జులై 15 వరకు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం భవనాల కూల్చివేతను నిలిపేయాలని పి.ఎల్. విశ్వేశ్వరరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేటి వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి విచారణ సందర్భంగా.. సచివాలయ భవనాల కూల్చివేత పనులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రమే సమర్పిస్తామన్నారు. దీంతో బుధవారం వరకు సచివాలయ కూల్చివేతపై హై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో సచివాలయ భవనాల కూల్చివేత మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే భవనాల కూల్చివేత సగం పూర్తయ్యింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే విషయమై సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.