యాప్నగరం

RTC Strike: ఒంటికి నిప్పు పెట్టుకున్న డ్రైవర్.. కేసీఆర్ ప్రకటనతో మనస్తాపం

RTC ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చింది. బలిదానాల దిశగా సాగుతోంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

Samayam Telugu 12 Oct 2019, 6:53 pm
మ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మికులను కలవరానికి గురి చేస్తోంది. ఖమ్మంలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి శనివారం (అక్టోబర్ 12) సాయంత్రం తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu driver


నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతం నిలిపివేశారనే వార్తలతో అతడు మరింత కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also Read: ధూంధాం, రాస్తారోకోలతో హోరెత్తనున్న తెలంగాణ.. ఆర్టీసీ సమ్మె ఉధృతం

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్టీసీ సమ్మె ఎనిమిది రోజులకు చేరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జేఏసీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. వారం రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ధూంధాం, రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, వంటావార్పు తదితర కార్యక్రమాలు ప్రకటించింది. 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

Don't Miss: ప్రధాని మోదీ సోదరుడి కుమార్తెపై ముసుగు దొంగల బీభత్సం.. ఢిల్లీలో దారుణం

మరోవైపు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పొడిగించారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను ప్రయాణికుల తరలింపునకు వినియోగించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.