యాప్నగరం

TSRTCకి బిగ్‌ షాక్.! తేల్చేసిన సీఎం, చైర్మన్ సంచలన ప్రకటన

నూతన ఆర్టీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే బాజిరెడ్డి గోవర్ధన్ షాకిచ్చారు. నాలుగు నెలల్లో లాభాల బాటలోకి రాకుంటే.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామని సీఎం హెచ్చరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 22 Sep 2021, 8:59 pm
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి భారీ షాక్ తగిలింది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సంచలన ప్రకటన చేశారు. నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆర్టీసీ చార్జీల పెంపు తదితర విషయాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ts rtc


ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. అందుకు గడువు కూడా విధించినట్లు చైర్మన్ చెప్పారు. మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రావాలని.. లేకుంటే ప్రైవేటుపరం చేస్తామని సీఎం గట్టిగా హెచ్చరించినట్లు బాజిరెడ్డి తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారని అన్నారు. సమీక్ష సందర్భంగా ఆర్టీసీ చార్జీల పెంపుపై చర్చించామని.. అసెంబ్లీ సమావేశాల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు పటిష్ట చర్యలు చేపడతామని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ చార్జీల పెంపు అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. గత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను 20 శాతం వరకూ పెంచింది. కనీస బస్సు చార్జీ రూ.5 నుంచి రూ.10లు చేసింది. చార్జీల పెంపు ద్వారా రోజుకి రూ.4 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని భావించింది. అయితే మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్న చందంగా కరోనా మహమ్మారి విజృంభణతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దానికి తోడు డీజీల్ ధరలు, నిర్వహణ ఖర్చులు కూడా పెరగడంతో ఆర్టీసీకి తలకు మించిన భారమైంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.