యాప్నగరం

TSRTC Alert: రేపు జీతాలు పడకపోతే.! జేఏసీ అల్టిమేటం, షాకింగ్ డెసిషన్

తెలంగాణలో మరోమారు ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుంటే సమ్మె బాట పడతామని జేఏసీ ఇప్పటికే అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది.

Samayam Telugu 5 Aug 2021, 8:39 pm
టీఎస్ ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగనుంది. నేటి వరకూ జీతాలు చెల్లించకపోవడంతో బస్సులు బంద్ చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. సమ్మెకి సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చింది. ఆగస్టు 6 తేదీ లోపు ఈ నెల జీతాలు చెల్లించకుంటే సమ్మె బాట పడతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. గతంలోనే పలు డిమాండ్లకు సంబంధించి మెమోరాండం సమర్పించి నెల రోజులు కావొస్తున్నా నేటికీ యాజమాన్యం స్పందించకపోవడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు జేఏసీ లేఖ రాసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tsrtc


రేపటిలోగా జీతాలు చెల్లించకుంటే 7 వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు లేఖలో నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారంపై కూడా యాజమాన్యం ఇంతవరకూ స్పందించపోవడం దారుణమని.. ఇప్పటి వరకూ కనీసం అధికారులను కూడా నియమించలేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వేతనాలు విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని.. తమ కష్టాలు ఎమ్మెల్యేలందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నిర్ణయించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.