యాప్నగరం

TSRTC ఆస్తుల అమ్మకంపై వీసీ సజ్జనార్ క్లారిటీ.. అలా చేసే ప్రసక్తే లేదు

టీఎస్ఆర్టీసీ గత ఆరు నెలల నుంచి పూర్తిగా అధ్యయనం చేశానని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టి ఆయన ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

Samayam Telugu 25 Mar 2022, 4:25 pm
టీఎస్ఆర్టీసీ గత ఆరు నెలల నుంచి పూర్తిగా అధ్యయనం చేశానని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టి ఆయన ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు. చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపో స్థాయి అధికారులతో ప్రతిరోజూ మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు.
Samayam Telugu ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్


అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులను గానీ.. ఏ ఒక్క డిపోను కూడా మూసివేసే ప్రసక్తిలేదని సజ్జనార్ స్పష్టంచేశారు. ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. వీఆర్ఎస్ ద్వారా ఎవరినీ ఉద్యోగాల్లో నుంచి తీసివేయమని చెప్పారు. అయితే ఆర్టీసీ ఉద్యోగుల్లో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అలాంటి వారి అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నామని అన్నారు. యూనియన్లు తీసివేయడంతో నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డ్స్ పనిచేస్తోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.