యాప్నగరం

TSRTC బాదుడు.. ప్రయాణికులపై ఏటా రూ.1000 కోట్ల భారం!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్దమైంది. 10-20 శాతం ఛార్జీలు పెంచితే ఏటా రూ.వెయ్యి కోట్ల ఆదాయం పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తో్ంది.

Samayam Telugu 22 Sep 2021, 9:37 am

ప్రధానాంశాలు:

  • ఛార్జీల పెంపునకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ
  • 10-20 నుంచి ఛార్జీలు పెంచే యోచన
  • ప్రయాణికులపై రూ.వెయ్యి కోట్ల భారం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
ఆర్టీసీ ప్రయాణికులపై త్వరలో ఛార్జీల పెంపు భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం చివరిసారిగా 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచింది. అప్పట్లో కనీస ఛార్జీని రూ. 5 నుంచి రూ. 10కి చేరుస్తూ మొత్తంగా ఛార్జీలను 20 శాతం వరకు పెంచింది. దాంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 4 కోట్ల మేరకు పెరిగింది. అయితే 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభం కావటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
Also Read: త్వరలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు .. సంకేతాలిచ్చిన సీఎం కేసీఆర్

మధ్యలో బస్సులు మళ్లీ రోడ్లెక్కినా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూలకు చేరాయి. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆదాయం పుంజుకుంటోంది. కొద్దిరోజుల కిందటే రోజువారీ ఆదాయం రూ. 13 కోట్లు దాటింది. అయినప్పటికీ డీజిల్‌, విడిభాగాల ధరలు పెరగడంతో వచ్చే ఆదాయం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. దీంతో ఈసారి కనీసం 10-20 శాతం మేరకు ఛార్జీలు పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 శాతం ఛార్జీలు పెంచితే రోజువారీ ఆదాయం రూ. 6 నుంచి రూ. 7 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. ఏడాదిలో కనీసం 175 రోజుల పాటు ఆ మేరకు ఆదాయం వస్తే రూ. వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.