యాప్నగరం

హైదరాబాద్‌ నుంచి ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు

హైదరాబాద్ నుంచి వెళ్లే వారి కోసం పలు ప్రాంతాల్లోని పాయింట్ల నుంచి బస్సుల్ని నడిపిస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఏపీలోని నగరాలకు కూడా బస్సులు నడుపుతున్నామన్నారు.

Samayam Telugu 3 Jan 2021, 6:46 am
సంక్రాంతి పండుగ సమయంలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది టీఆఎస్ ఆర్టీసీ. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తంగా 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ రీజినల్ మేజనర్ వరప్రసాద్ తెలిపారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు నడపనుండగా... ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 1,600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు మొత్తం 4981 బస్సులను నడిపిస్తామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
Samayam Telugu సంక్రాంతికి స్పెషల్ బస్సులు
tsrtc special buses


Read More: ఈ లగ్గం పిలుపు మస్తుగుంది.. అచ్చ తెలంగాణ శుభలేఖ జోర్దార్‌గా, ఎవరిదో తెల్సా..

మహాత్మాగాందీ, జూబ్లీ బస్టాండ్స్‌తోపాటు నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సౌకర్యార్థం ఇసీఐఎల్‌, అమీర్‌పేట్‌, ఆఘాపూర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాలల్లోని పాయింట్ల నుంచి బస్సుల్ని నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూర్‌, విశాఖపట్నం, తిరుపతి తదితర ముఖ్యపట్టణాలకు దసరా ప్రత్యేక బస్సులను నడిపిస్తామన్నారు. ఇక, ఈ ప్రత్యేక బస్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు కరోనావైరస్‌ వ్యాప్తి తర్వాత.. చాలా కాలం డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం అయిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.