యాప్నగరం

అమీన్‌పూర్ బాలిక అత్యాచార కేసులో ట్విస్టు

Hyderabad శివార్లలోని అమీన్‌పూర్‌లో 16 ఏళ్ల బాలిక తనపై సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన ఘటన షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.

Samayam Telugu 23 Jan 2020, 11:16 pm
టాన్‌చెరు సమీపంలోని అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం కేసు మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు తేల్చారు. వైద్య పరీక్షలో రేప్ జరగలేదని తేలింది. పోలీసుల విచారణలోనూ తనపై అత్యాచారం జరగలేదని బాలిక తెలిపినట్లు సమాచారం. విచారణలో బాలిక పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Samayam Telugu Police
నమూనా చిత్రం


మైనర్ బాలిక (16)ను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అమీన్‌పూర్ పోలీసులకు గురువారం (జనవరి 23) ఫిర్యాదు అందింది. స్థానిక కిరాణా షాప్‌లో సరకులు తీసుకురావడానికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు నిలదీయగా కట్టుకథ చెప్పినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లు చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బాధితురాలి తండ్రిది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాగా తెలుస్తోంది. అమీన్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ డ్యూటీ చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఆడుకుంటూ బిల్డింగ్ పైనుంచి పడిపోయిన బాలుడు

Must Read: స్మార్ట్‌ఫోన్లతో జాగ్రత్త.. మహిళలే ఎక్కువగా ట్రాప్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.