యాప్నగరం

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి.. మంచిర్యాలలో విషాదం

mancherial: మిగిలిన ఇద్దరు పిల్లలు భయపడిపోయి స్థానికులకు సమాచారం అందించారు. వారు నీటిలో దూకి చనిపోయిన వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు.

Samayam Telugu 16 May 2020, 9:15 pm
Samayam Telugu చనిపోయిన బాలురు
మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. చల్లగా ఈత కొట్టేందుకు వెళ్లిన దోస్తులు బాలురు ప్రమాదవశాత్తు వాగు నీటిలో పడి చనిపోయారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామంలో ఈ విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఐదుగురు స్నేహితులు సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. రాదండి సంపత్(14), కుంచే రాంచరణ్(13) అనే ఇద్దరు స్నేహితులు వాగు నీటిలో మునిగిపోయి చనిపోయారు.

మిగిలిన ఇద్దరు పిల్లలు భయపడిపోయి స్థానికులకు సమాచారం అందించారు. వారు నీటిలో దూకి చనిపోయిన వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. చనిపోయిన రాదండి సంపత్ తండ్రి సత్యనారాయణ వ్యవసాయం. వీరి స్వగ్రామం మాడవెల్లి. మరో మృతుడు కుంచె రాం చరణ్‌ స్వస్థలం తాండూర్ మండలం అచులాపూర్. సెలవులకు అమ్మమ్మ ఊరు మాడవెల్లికి వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహలను పోస్ట్ మార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: కొంపముంచిన బర్త్ డే పార్టీ.. హైదరాబాద్ అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కరోనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.