యాప్నగరం

పోలీస్ వాహనం ఢీకొని బాలుడు మృతి, చిన్నారిని గుద్దేసిన టిప్పర్

Chandrayangutta: మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే 7 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆ బాలుడిని గుద్దింది.

Samayam Telugu 30 Sep 2020, 5:40 pm
హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు అసువులు బాశారు. నగరంలోని సీతారాం బాగ్‌లో ఓ పోలీస్ వాహనం ఒక చిన్నారి బాలుడిని ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో మూడేళ్ల పాప టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది.
Samayam Telugu చనిపోయిన బాలుడు
two accidents in hyderabad


మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే 7 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆ బాలుడిని గుద్దింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని డ్రైవర్ భగవాన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సీఐ రాంవీర్ రెడ్డి ఆ బాలుడి తెలిపారు. ఆ బాలుడి మృతి గురించి విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని పరామర్శించారు.

మరోవైపు, పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 3 సంవత్సరాల మారుయం అనే చిన్నారి ఇంట్లో నుండి బయటికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో టిప్పర్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆ బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.