యాప్నగరం

హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లకు కరోనా.. 45కు చేరిన కేసులు

Telangana Coronavirus cases అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం రాత్రికి 45కు పెరిగాయి. వీరిలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా 10 మందికి కరోనా సోకింది.

Samayam Telugu 27 Mar 2020, 12:47 am
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. గురువారం (మార్చి 26) మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరగా.. రాత్రి వరకు మరో కేసు నిర్ధారణ అయింది. సికింద్రాబాద్‌లోని బుద్ధానగర్‌కు చెందిన 45 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. ఇతడు ఇటీవలే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. దగ్గు, జ్వరం లక్షణాలతో కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేరాడు. ఇతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
Samayam Telugu ccmb


ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా సోకిన కరోనా కేసుల సంఖ్య 10కి చేరింది. కరోనా అనుమానిత లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరిగింది.

రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. దోమల్‌గూడకు చెందిన 43 ఏళ్ల వైద్యుడు.. కరోనా బారినపడ్డ వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వైరస్ సోకింది. ఆ వైద్యుడి ద్వారా అతడి భార్య (36)కు కూడా కరోనా సోకింది. కరోనా వైరస్‌ను ఈ దశలోనే కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ పరిస్థితి కూడా దాటితే.. ఇక ఆ నష్టం ఊహకు కూడా అందదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.