యాప్నగరం

సంగారెడ్డి: ఫ్యామిలీపై కత్తులతో దాడి.. కొడుకు మృతి, తండ్రి పరిస్థితి విషమం

Sangareddy: దేవయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుడిని హైదరాబాద్‌‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Samayam Telugu 5 Jan 2021, 10:56 pm
సంగారెడ్డిలో రెండు కుటుంబాలకు చెందిన వారు కత్తులతో పరస్పర దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఓ వ్యక్తి చనిపోయాడు. సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తులతో జరిగిన ఘర్షణ భూతగాదా వల్ల తలెత్తింది. మెదక్ ఎస్సీ కార్పొరేషన్ ఏడీ బేగరి దేవయ్య, ప్రదీప్ కుటుంబం మధ్య ఈ దాడి చోటుచేసుకుంది. దేవయ్య, అతని కుమారుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దేవయ్య కుమారుడు కరుణాకర్ మృతి చెందాడు. దేవయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుడిని హైదరాబాద్‌‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Samayam Telugu దాడి చేసుకుంటున్న దృశ్యం
knifes attack


గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన బేగరి దేవయ్య, కాశగారి ప్రదీప్‌ మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దేవయ్య, ఆయన కొడుకు కరుణాకర్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. కరుణాకర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా దేవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.