యాప్నగరం

US: అమెరికాలో విషాదం.. సరస్సులో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

US: అమెరికాలో తీవ్ర విషాదం నెలకొంది. వైద్య విద్యను అభసిస్తోన్న ఇద్దరు తెలుగు విద్యార్థులు.. వారాంతంలో సరదాగా ఈతకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు సరస్సులో గల్లంతయ్యారు. కాగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ కుమారులు మరణ వార్త విని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నత విద్య పూర్తి చేసి.. పట్టాలతో వస్తారనుకున్న కొడుకులు విగతజీవులుగా వస్తున్నారంటూ తలుచుకుని గుండెలు బాదుకుంటున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 28 Nov 2022, 3:29 pm

ప్రధానాంశాలు:

  • అమెరికాలో మృత్యువాత పడిన తెలుగు విద్యార్థులు
  • వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
  • గాలింపు చేపట్టిన సిబ్బందికి ఇద్దరి మృతదేహాలు లభ్యం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu died
US: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. వీకెండ్‌ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు తిరిగి విగతజీవులుగానే దొరికారు. వారాంతం కావటంతో మిస్సోరిలోని ఓజార్క్‌ లేక్‌లో ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అక్కడి సిబ్బంది గాలింపు చేపట్టగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఇద్దరు విద్యార్థులు మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు జనార్ధన్‌, ఝాన్సీ లక్ష్మీ కుమారుడు ఉత్తేజ్.. హెల్త్‌ సైన్స్‌ డేటాలో మాస్టర్స్‌ చేసేందుకు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్‌ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా.. వైద్య విద్య అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. సెయింట్‌ లూయిస్‌ వర్సిటీలో డెంటల్‌ ఎంఎస్‌ విద్య అభ్యసిస్తున్నాడు.
శనివారం రోజు.. ఇద్దరు స్నేహితులు కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లారు. సరస్సులో సరదాగా ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఉత్తేజ్ నీటిలో మునిగిపోసాగాడు. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఉత్తేజ్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన శివదత్తు.. అతన్ని కాపాడేందుకు సరస్సులో దూకాడు. అయితే.. శివదత్తు కూడా నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు సరస్సులో గాలించగా.. కొన్ని గంటల తర్వాత ఉత్తేజ్ మృతదేహాం లభించింది. తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి తర్వాతి రోజు శివదత్త మృతదేహం దొరికింది.

ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లిన కుమారులు.. పట్టభద్రులై ఇంటికి తిరిగి వస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు.. ఊహించని రీతిలో మరణ వార్త వినిపించటంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ వార్త తెలిసి.. ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ దుర్ఘటనపై స్పందించారు. మృత దేహాలను వీలైనంత త్వరగా స్వగ్రామాలకు తీసుకురావడానికి బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని తన కార్యాలయానికి సూచించారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.