యాప్నగరం

కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బాపట్లకు చెందిన ఇద్దరు మృతి

కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. ముకుందాపురం గ్రామం దగ్గర్లో వీరు ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది.

Samayam Telugu 8 May 2020, 12:17 pm
లాక్‌డౌన్ సమయంలోనూ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఆగడం లేదు. చౌటుప్పల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా.. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో చోటు చేసుకున్న మరో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన వారే.
Samayam Telugu accident


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోళ్లపూడి ధనలక్ష్మీ (46), బస్వత్ కోటేశ్ (38), పెండెల సాయి సందీప్ కార్లో హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా బాపట్ల బయల్దేరారు. శుక్రవారం ఉదయం ముకుందాపురం సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ధనలక్ష్మీ, కోటేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన సాయి సందీప్‌ను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.