యాప్నగరం

ఇద్దరికి రెండోసారి కరోనా పాజిటివ్... వైద్యశాఖ అప్రమత్తం

తెలంగాణలో తొలిసారిగా ఇద్దరికి కరోనా రెండోసారి సోకింది. అయితే ఎవరిలో అయితే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కావడంలేదో అలాంటివారికి కరోనా రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 26 Aug 2020, 7:17 am
ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదనే భ్రమల నుంచి బయటపడాలంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఒకసారి వైరస్ సోకిన ఇద్దరికి మరోసారి కరోనా పాజిటివ్ వచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే లక్షకు పైగా కేసులు నమోదు కాగా అందులో ఇద్దరికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. అయితే మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నంత ప్రభావం రెండవసారి వచ్చినప్పుడు లేదని వారు వెల్లడించారు.
Samayam Telugu రెండోసారి కరోనా పాజిటివ్
corona positive for second time


అయినప్పటికీ రెండోసారి కూడా కరోనా సోకే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు ఈ వైరస్ సోకని వారితో పాటు కోలుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఎవరిలో అయితే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కావడం లేదో అలాంటి వారికి మళ్లీ వచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
Read More: మహబూబాబాద్ కలెక్టర్‌కు కరోనా.. ఆ మంత్రులందరిలో కలవరం
మరోవైపు మంగళవారం రాష్ట్రంలో 2,579 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670 చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 770 కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,752 మంది కోలుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.