యాప్నగరం

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. మలక్‌పేటలో బీభత్సం

Malakpet: ఆర్టీసీ బస్సులు బీభత్సం చేశాయి. బస్టాఫ్‌లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భీతిల్లిపోయారు.

Samayam Telugu 27 Nov 2019, 5:55 pm
లక్‌పేటలో ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులను భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో ముగ్గురు స్వల్ప గాయాలయ్యాయి. బస్టాఫ్‌లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వచ్చిన మరో బస్సు అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సులూ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మలక్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్ ప్రధాన రహదారిపై బుధవారం (నవంబర్ 27) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu malakpet


తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మలక్‌పేట బస్టాఫ్‌లో దిల్‌సుఖ్ నగర్ వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా.. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

తాత్కాలిక డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని.. దీంతో బస్సు అదుపుతప్పి వేగంగా వచ్చి మరో బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనతో మలక్‌పేట దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Also Read: బతకనివ్వండి సర్.. కేసీఆర్‌కు కండక్టర్ భావోద్వేగ లేఖ

తాత్కాలిక డ్రైవర్ల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ బస్సులను ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులను చూస్తేనే కొంత మంది ఆమడ దూరం జరుగుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లరకు సరైన అర్హతలు, అనుభవం లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.