యాప్నగరం

ఫేక్ ఆధార్‌పై యూఐడీఏఐ విచారణ రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..

UIDAI: హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విడుదల చేసిన ఆ ప్రకటనను బాలాపూర్‌లోని చంద్రాయణ్ గుట్ట రోడ్డులోగల మెగా గార్డెన్ ఫంక్షన్ హాలు ప్రహరీకి అంటించారు.

Samayam Telugu 20 Feb 2020, 4:07 pm
నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు పొందారనే అరోపణలపై యూఐడీఏఐ హైదరాబాద్‌లో 127 మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన పత్రాలతో తమ పౌరసత్వం నిరూపించుకుంటే ఆధార్ కొనసాగుతుందని, లేదా దాన్ని రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే, తాజాగా ఆ విచారణను రద్దు చేశారు. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu Aadhaar


హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విడుదల చేసిన ఆ ప్రకటనను బాలాపూర్‌లోని చంద్రాయణ్ గుట్ట రోడ్డులోగల మెగా గార్డెన్ ఫంక్షన్ హాలు ప్రహరీకి అంటించారు. ఈ ప్రకటన ప్రకారం.. ‘‘ప్రస్తుతం వీరి విచారణను రద్దు చేస్తు్న్నాం. తదుపరి చర్య ఎప్పుడనేది విచారణకు హాజరు కావాల్సిన వారికి ఇప్పటికే స్పీడ్ పోస్టులో వివరాలు పంపాం’’ అని పేర్కొన్నారు.

Also Read: 127 మందికి ఆధార్ నోటీసులు: సంచలన విషయాలు వెలుగులోకి .. అతనే అసలు సూత్రధారి


హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని గుర్తు చేశారు.

Must Read: హీరోయిన్ రష్మిక ఫోటోపై జగిత్యాల కలెక్టర్ కామెంట్.. పోలీసులకు ఫిర్యాదు

Also Read: కలెక్టర్ల కన్నా ఎక్కువ జీతాలు.. అయినా పని చేయరా? నిలదీసిన మంత్రి హరీశ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.