యాప్నగరం

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై రౌడీల దాడి.. నిర్వహకులను చితకబాది దారుణం.. వీడియో

Chikkadpally: నిర్వహకులను ఇష్టం వచ్చినట్లుగా కర్రలతో చితకబాదారు. ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై దాడి చేసి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు

Samayam Telugu 1 Oct 2020, 4:00 pm
హైదరాబాద్‌లో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్పైస్ కోర్ట్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖాలకు మాస్కులు ధరించి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై మూకుమ్మడి దాడి చేశారు. నిర్వహకులను ఇష్టం వచ్చినట్లుగా కర్రలతో చితకబాదారు. ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై దాడి చేసి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
Samayam Telugu దుండగుల దాడి
mob attacks on a fast food center in hyderabad


అయితే, ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల విషయంలో దాడికి పాల్పడ్డారా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.