యాప్నగరం

ఏటీఎం స్క్రీన్‌పై ఉమ్మి.. కరోనా వ్యాప్తికి కావాలనే చేశారా?

coronavirus cases: విషయం గమనించిన బ్యాంకు సిబ్బంది మున్సిపల్ అధికారుల సహకారంతో రసాయనాలను పిచికారీ చేయించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు కెమికల్‌ స్ప్రే చేశారు.

Samayam Telugu 18 Apr 2020, 4:11 pm
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఓ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు ఏటీఎంపై ఉమ్మి వేసి వెళ్లిపోయాడు. గోదావరి ఖనిలోని అడ్డగుంటపల్లి చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు సిబ్బంది ఈ విషయాన్ని గురువారం రాత్రి గుర్తించినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలే కరోనా వైరస్ ప్రభంజనంతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే ఇలా ఏటీఎం మెషిన్ స్క్రీన్‌పై ఉమ్మి వేసి పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే అరెస్టు తప్పదని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu india-atms


Also Read: KTR: ఆకలితో అల్లాడుతున్న 5 నెలల పాప.. అర్ధరాత్రి కేటీఆర్ సాయం

విషయం గమనించిన బ్యాంకు సిబ్బంది మున్సిపల్ అధికారుల సహకారంతో రసాయనాలను పిచికారీ చేయించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు కెమికల్‌ స్ప్రే చేశారు. ఏటీఎం ముందు, ఏటీఎం లోపల కూడా పారిశుద్ధ్య సిబ్బంది కెమికల్‌ స్ప్రే చేశారు. మరోవైపు, బ్యాంకు ఖాతాదారులు విషయం తెలిసి ఆందోళనకు గురవుతున్నారు. ఇది కొంత మంది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అంటూ చర్చించుకుంటున్నారు.

Also Read: undefined

కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా రోడ్లపై కరెన్సీ నోట్లు కనిపించినా జనం దూరం జరుగుతున్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.