యాప్నగరం

కరీంనగర్‌లో ‘కొత్త వైరస్’ అంటూ కరపత్రాలు.. ఎవరి గురించో తెలిస్తే షాక్

Karimnagar: గన్నేరువరం మండలంలో ఈ కరపత్రాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా, రెవెన్యూ అధికారులు దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం.

Samayam Telugu 29 Jul 2020, 11:38 pm
కరీంనగర్‌ జిల్లాలో ‘కొత్త వైరస్’ ఒకటి పుట్టుకొచ్చింది. కాకపోతే ఇది నిజమైన వైరస్ కాదు. ఓ ప్రభుత్వ అధికారి విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతను వైరస్ అని జనం ఇలా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏకంగా కర పత్రాలు ముద్రించి సైతం పంచుతున్నారు. దీన్నిబట్టి సదరు అవినీతి బాగోతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. Must Read: undefined
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Karimnagar


మండలంలో కరోనా వైరస్ కంటే రెవెన్యూ శాఖలో ఉన్న వైరస్ ఇంకా ప్రమాదం అని అందులో నయాబ్ కమృద్దీన్ అనే తహసీల్దార్ బాధితులం అని ఆరోపిస్తూ మండలంలోని వివిధ గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలను ఇంటింటికి పంచుతున్నారు. దీంతో గన్నేరువరం మండలంలోని రెవెన్యూ అధికారి బాగోతం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా లంచాలకు అలవాటు పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
గన్నేరువరం మండలంలో ఈ కరపత్రాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా, రెవెన్యూ అధికారులు దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. దీంతో ఈ వ్యవహారాన్ని తాము విచారణ జరిపి దీనికి కారణమైన గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. Don't Miss: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.