యాప్నగరం

హైదరాబాద్‌లో గణపతి లడ్డూ చోరీ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు

Vinayaka Chavithi 2020: వినాయక మండపంలో గణపతి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంత దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి గణపతి వద్ద లడ్డూను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Samayam Telugu 25 Aug 2020, 5:50 pm
హైదరాబాద్‌లో దొంగలు ఓ వస్తువు చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆఖరికి వినాయక మండపంలోని లడ్డూలను సైతం వారు వదలడం లేదు. రంగారెడ్డి జిల్లాలో వినాయక మండపంలో ఓ లడ్డూ చోరీ జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీలో స్థానికులు ఓ వినాయకుణ్ని ప్రతిష్ఠించారు. ఆ వినాయక మండపంలో గణపతి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ఇప్పుడు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంత దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి గణపతి వద్ద లడ్డూను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ganesh


కొంత మంది ముసుకు వేసుకున్న వ్యక్తులు రావడం ఆ కాలనీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వారు వెల్లడించారు. వారు తిరిగి వెళ్లే క్రమంలో గణపతి లడ్డూను దొంగిలించి తీసుకెళ్తున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.