అన్ని కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొనే కేంద్ర బడ్జెట్ 2020-21 తయారు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఆర్థిక మంత్రి ఎఫ్ఆర్బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, బడ్జెట్ మేనేజ్మెంట్) సదస్సును నిర్వహించారు. బడ్జెట్పై దిగ్గజ పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రముఖ నగరాల్లోని వ్యాపార వేత్తలతో బడ్జెట్ గురించి చర్చిస్తున్నామని సీతారామన్ అన్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర స్పందన కూడా తన దృష్టికి వచ్చిందని, పన్నుల్లో రాష్ట్ర వాటాలకు 42 నుంచి 41 శాతానికి తగ్గింపు పూర్తిగా తమ చేతుల్లో లేదని ఆమె స్పష్టం చేశారు. బడ్జెట్ రూపకల్పనలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులనే పాటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య పెరిగినందున పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేది వాస్తవం కాదని నిర్మల అన్నారు.
అదే తప్పయితే.. కేటీఆర్ ఫిర్యాదు చేసుకోవచ్చు..
పన్నుల వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని గుర్తు చేశారు. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ర్ట వాటా అధికంగానే ఉందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ చాలా చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తోందని అభినందించారు. బడ్జెట్రోజు పార్లమెంటులో ‘గివ్’ అనే పదం వాడారని కేటీఆర్ అన్నారని, ఆ పదం వాడడం తప్పేంకాదని స్పష్టం చేశారు. ఒక వేళ అది తప్పయితే లోక్సభ స్పీకర్కు ఆయన ఫిర్యాదు చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. మరోవైపు, రూ.2 వేల నోటు రద్దు చేయబోమని నిర్మల స్పష్టతనిచ్చారు.
అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండడమే ఎన్డీఏ ప్రభుత్వ విధానమని చెప్పారు. తనను అత్యధిక సమయం బడ్జెట్ చదివిన మంత్రిగా కంటే.. ఎక్కువ కాలం బడ్జెట్కు రూపకల్పన చేసిన ఆర్థిక మంత్రిగా గుర్తుంచుకోవాలన్నారు. ఈ బడ్జెట్ గత జులై నుంచి ఇప్పుడు ఫిబ్రవరి వరకు కసరత్తు చేశామని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదని నిర్మల గుర్తు చేశారు. ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకున్నామని, వాజ్పేయి, మోదీ నేతృత్వంలో వచ్చిన బడ్జెట్లలో ఇది కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు.
అన్ని ప్రముఖ నగరాల్లోని వ్యాపార వేత్తలతో బడ్జెట్ గురించి చర్చిస్తున్నామని సీతారామన్ అన్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర స్పందన కూడా తన దృష్టికి వచ్చిందని, పన్నుల్లో రాష్ట్ర వాటాలకు 42 నుంచి 41 శాతానికి తగ్గింపు పూర్తిగా తమ చేతుల్లో లేదని ఆమె స్పష్టం చేశారు. బడ్జెట్ రూపకల్పనలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులనే పాటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య పెరిగినందున పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేది వాస్తవం కాదని నిర్మల అన్నారు.
అదే తప్పయితే.. కేటీఆర్ ఫిర్యాదు చేసుకోవచ్చు..
పన్నుల వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని గుర్తు చేశారు. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ర్ట వాటా అధికంగానే ఉందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ చాలా చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తోందని అభినందించారు. బడ్జెట్రోజు పార్లమెంటులో ‘గివ్’ అనే పదం వాడారని కేటీఆర్ అన్నారని, ఆ పదం వాడడం తప్పేంకాదని స్పష్టం చేశారు. ఒక వేళ అది తప్పయితే లోక్సభ స్పీకర్కు ఆయన ఫిర్యాదు చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. మరోవైపు, రూ.2 వేల నోటు రద్దు చేయబోమని నిర్మల స్పష్టతనిచ్చారు.
అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండడమే ఎన్డీఏ ప్రభుత్వ విధానమని చెప్పారు. తనను అత్యధిక సమయం బడ్జెట్ చదివిన మంత్రిగా కంటే.. ఎక్కువ కాలం బడ్జెట్కు రూపకల్పన చేసిన ఆర్థిక మంత్రిగా గుర్తుంచుకోవాలన్నారు. ఈ బడ్జెట్ గత జులై నుంచి ఇప్పుడు ఫిబ్రవరి వరకు కసరత్తు చేశామని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదని నిర్మల గుర్తు చేశారు. ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకున్నామని, వాజ్పేయి, మోదీ నేతృత్వంలో వచ్చిన బడ్జెట్లలో ఇది కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు.