యాప్నగరం

తెలంగాణపై కేంద్రం ప్రశంసలు.. కేసీఆర్ తెచ్చిన ఆ పథకం భేష్ అంటూ కితాబు

Narendra Singh Tomar: కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Samayam Telugu 27 Aug 2020, 5:44 pm
తెలంగాణలో అమలవుతున్న పథకాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కేంద్రం అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రశంసించారు. మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి పథకంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు.
Samayam Telugu కేసీఆర్
kcr image


ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితుల గురించి సంజయ్ అగర్వాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన చెప్పారు. ఈ తరహా కార్యక్రమాలు తెలంగాణలో ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతుల నెట్‌వర్క్ విస్తరించిందని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.