యాప్నగరం

తెలంగాణకు గుడ్ న్యూస్.. మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

Telangana Projects: తెలంగాణ సాగు నీటి రంగంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో నిర్మిస్తోన్న మరో మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర జల్ శక్తి ఆమోదం తెలిపింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన టీఏసీ భేటీలో భూపాలపల్లిలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, నిజామాబాద్‌లోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోలతో పాటు ఆదిలాబాద్‌లోని చనకా- కొరాట ఆనకట్టకు కేంద్ర జల శక్తి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి త్వరలోనే మినిట్స్ జారీ కానున్నాయి.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 29 Nov 2022, 6:00 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు
  • రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల్ శక్తి ఆమోదం
  • ప్రాజెక్టుల ఆమోదానికి త్వరలోనే మినిట్స్ జారీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jal Shakthi
Telangana Projects: తెలంగాణ సాగు నీటి రంగంలో మరో ముందడుగు పడింది. మ‌రో మూడు సాగునీటి ప్రాజెక్టుల‌కు టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ(TAC) ఆమోదం తెలిపింది. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ ఆధ్యక్షతన ఢిల్లీలో టీఏసీ భేటీ జరిగింది. కాగా.. ఈ భేటీలో భూపాలపల్లిలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, నిజామాబాద్‌లోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోలతో పాటు ఆదిలాబాద్‌లోని చనకా- కొరాట ఆనకట్టకు కేంద్ర జల శక్తి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి త్వరలోనే మినిట్స్ జారీ కానున్నాయి.
సెప్టెంబ‌ర్‌ 2021లోనే కేంద్ర జ‌ల‌ సంఘానికి, గోదావ‌రి రివ‌ర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల‌ను అందించింది. కాగా.. కేంద్ర జ‌లసంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్‌ల‌కు ఆమోదం తెలిపాయి. 3 ప్రాజెక్టుల‌కు టెక్నో ఎక‌నామిక్ క్లియ‌రెన్స్ ఇవ్వవచ్చని కేంద్ర జ‌ల సంఘం సిఫార‌సు కూడా చేసింది. అయితే.. ఈరోజు జరిగిన టీఏసీ భేటీలో మూడు ప్రాజెక్టుల‌పై చ‌ర్చించారు. టీఏసీ స‌భ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణ ప్రతినిధులు ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది.. మూడు ప్రాజెక్టులకు టీఏసీ ఆమోదాన్ని ప్రకటించింది.

టీఏసీ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు సీ మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుసూధన్, సీఎం ఒఎస్‌డీ శ్రీధర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు. తెలంగాణ మూడు ప్రాజెక్టులను ఆమోదించినందుకు కమిటీ ఛైర్మన్ పంకజ్ కుమార్‌కు, సభ్యులకు రజత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.