హైదరాబాద్కు అమిత్ షా.. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు
గ్రేటర్ ప్రచారం కోసం వచ్చిన అమిత్ షా.. ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రేటర్ ప్రచారంలో పాల్గొననున్నారు.
Samayam Telugu 29 Nov 2020, 12:47 pm
హైదరాబాద్లో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాతబస్తీకి చేరుకున్నారు అమిత్ షా. అక్కడ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం సికింద్రాబాద్ వారాసిగూడలో ఎన్నికల ప్రచారానికి షా బయల్దేరారు.
Read More: పాతబస్తీలో కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అమిత్ షా రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసుకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి హోంమంత్రి బయల్దేరి వెళ్లనున్నారు. షా పర్యటనతో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read More: పాతబస్తీలో కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అమిత్ షా రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసుకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి హోంమంత్రి బయల్దేరి వెళ్లనున్నారు. షా పర్యటనతో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.