యాప్నగరం

Kaleshwaram Project: కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు.. కేంద్రమంత్రి ఆరోపణలు

కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. టెక్నికల్ సామర్థ్యంలేని సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రాజెక్టును ముంచేశారన్నారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 18 Aug 2022, 12:58 pm

ప్రధానాంశాలు:

  • కాళేశ్వరం ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు.. కేసీఆర్‌ది మాత్రమే
  • కమిషన్ల కోసమే తప్పుడు డిజైన్‌లో నిర్మించారు
  • కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపణలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gajendra singh shekhawat
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మోటార్లు మునిగిపోవడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ పరిస్థితిని చూసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తుండగా ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డుకుంటోంది. తాజాగా కాళేశ్వరం వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి అటువైపు ఎవరు వెళ్లినా అరెస్టులు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందని బీజేపీ ఎప్పటినుంచే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Aarogyasri Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 10లక్షల కుటుంబాలకు ప్రయోజనం
ఈ నేపథ్యంలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(gajendra singh shekhawat) కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ సీఎం కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అవినీతి హద్దులు దాటిందని ఆరోపించారు. వరదల కారణంగా మూడు పంప్‌హౌసులు మునిగిపోయాయని, వాటిని సరైన పద్ధతిలో అమర్చకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ నుంచే అవినీతి మొదలైందని, ఇప్పుడు పంపుల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేకపోయినా కమిషన్ల కోసం దానికే అప్పగించారని ఆరోపించారు. గజేంద్రసింగ్ షెకావత్.. కొద్దిరోజుల క్రితం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాంగ్ డిజైన్ అని, ఇంజినీరింగ్ లోపంతోనే పంప్‌హౌసులు మునిగాయని తెలిపారు. కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.