యాప్నగరం

వరద బాధితులకు కిషన్ రెడ్డి 3 నెలల జీతం విరాళం

Telangana Rains: ఇప్పటికే తమ వంతు సాయం కింద టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ఆగ్ర హీరోలు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అంతేగాక పలు రాజకీయ నేతలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.

Samayam Telugu 20 Oct 2020, 10:40 pm
రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరబాద్‌ నగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం చేసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు సహా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం ఉదారత చాటారు. బాధితులను ఆదుకునేందుకు కిషన్‌రెడ్డి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.
Samayam Telugu కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
kishan reddy


ఇప్పటికే తమ వంతు సాయం కింద టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ఆగ్ర హీరోలు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అంతేగాక పలు రాజకీయ నేతలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే వరద బాధితులకు విరాళాలు ప్రకటించారు.

వరద తాకిడితో పట్టణంలోని పలు కాలనీలు పెద్ద కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో చాలా చోట్ల అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ వరదల వల్ల సామాన్య జనం నుంచి ధనిక ప్రజల వరకు నిత్యావసర సరకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.