యాప్నగరం

మాజీ మంత్రి మరణం పట్ల కిషన్ రెడ్డి సంతాపం

Gandhi Hospital: బీజేపీ సీనియర్ నేత అయిన మాణిక్యాలరావు కరోనా సంక్రమించడం వల్ల చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం చనిపోయారు.

Samayam Telugu 1 Aug 2020, 8:54 pm
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాణిక్యాలరావు చనిపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి పని చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అందరితో కలిసిపోతారని, మంచి స్నేహశీలి, చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Samayam Telugu కిషన్ రెడ్డి
kishan reddy


బీజేపీ సీనియర్ నేత అయిన మాణిక్యాలరావు కరోనా సంక్రమించడం వల్ల చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం చనిపోయారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత, చంద్రబాబు కేబినెట్‌లో బీజేపీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. దేవాదాయశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు. 2018లో టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడంతో ఈయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.


గాందీని సందర్శించిన కిషన్ రెడ్డి
కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ వైద్యుల నియామకాలను పెంచాలని కిషన్ రెడ్డి సూచించారు. కరోనా విజేతలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్‌లో కరోనా తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.