యాప్నగరం

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మృతదేహం కలకలం

లోటస్ పాండ్‌లో ఉదయమే పలువురు వాకింగ్ కోసం వస్తూ ఉంటారు. సాయంత్రం వేళలో కూడా కొందరు జాగింగ్ వాకింగ్ కోసం ఇక్కడకు వస్తుంటారు. అలాంటి ఈ పాండ్‌లో మృతదేహం లభ్యం అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Samayam Telugu 25 Oct 2020, 1:03 pm
లోటస్ పాండ్ లో మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి లభ్యం అయ్యింది. ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది హత్య ? లేక ఆత్మహత్య ? అనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లోటస్ పాండ్‌లో వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Samayam Telugu లోటస్ పాండ్ ( ఫైల్ ఫోటో)
hyderabad lotus pond


Read More: మృతదేహానికి మూడు లక్షలు... ప్రైవేట్ ఆస్పత్రి దారుణం

చనిపోయిన వ్యక్తి టీషర్ట్, ట్రాక్ పాయింట్ వేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పుడు ఆ మృతుడి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటికి సమీపంలో లోటస్ పాండ్ ఉంటుంది. ఇక్కడ మృతదేహం దొరకడంతో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మోర్నింగ్ వాక్ కోసం లోటస్ పాండ్‌కు రోజూ వచ్చే వారిని కూడా గుర్తించి ప్రశ్నిస్తున్నారు. లోటస్ పాండ్ చుట్టుపక్కల నివసించే వారిని కూడా ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.