యాప్నగరం

నాకు కరోనా లేదు.. నిర్భయంగా కూరగాయలు కొనండి.. వ్యాపారి వినూత్న ఆలోచన

కరోనా కారణంగా అన్నిరకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అయితే కూరగాయలు వ్యాపారం చేసేవారు మాత్రం అరకొరగా తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే వారి దగ్గర కూడా కరోనా భయంతో కూరగాయలు కొనాలంటేనే జనం భయపడుతున్నారు.

Samayam Telugu 26 Aug 2020, 9:30 am
కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్న .. ఏం కొనాలన్న భయపడాల్సిన పరిస్థితి. అలా అని నిత్యావసరాలు లేకుండా జివించలేం. కూరగాయాలు, పప్పులు ఉప్పుల కోసం బయటకు వెళ్లి కొనాల్సిన తప్పక పరిస్థితి. అయితే పలుచోట్ల కూరగాయల మార్కెట్లలో కూడా కరోనా కలకలం రేపింది. పలువురు కూరగాయలు చేసే వ్యాపారులకు కూడా కరోనా సోకింది. దీంతో కూరగాయాలు కొనాలన్న కూడా ప్రజలు భయపడే పరిస్థితి. దీంతో ఓ కరోనా వ్యాపారి కరోనా విషయంలో వినూత్నంగా ఆలోచించాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారి తనకు కరోనా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. తన వద్ద ఎవరైనా నిర్భయంగా కాయగూరలు కొనవచ్చన్నాడు.
Samayam Telugu కూరగాయల వ్యాపారి కరోనా సర్టిఫికెట్
vegetable vendor corona certificate

Read More: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి.. పోలీస్ శాఖలో విషాదం
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు మార్కెట్‌కు వచ్చి నిత్యావసరాల కొనుగోలుకూ భయపడుతున్నారు. ఈక్రమంలో పాత ఉట్నూరుకు చెందిన కూరగాయల దుకాణదారు డోలి శంకర్‌ మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తనకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆ రిపోర్టుకు ఫ్రేమ్ కట్టించాడు. తన దుకాణంలో అందరికీ కనిపించేలా ఫ్రేమ్‌ కట్టి తగిలించాడు. ‘నాకు కరోనా లేదు.. నిర్భయంగా కూరగాయలు కొనవచ్చు’ అని వినియోగదారులకు భరోసా కల్పిస్తున్నాడు. దీంతో శంకర్ చేసిన ఈ వినూత్న ప్రయోగం మరికొందరు వ్యాపారులను ఆలోచనలో పడేసింది. అంతేకాదు.. ఇప్పుడు టౌన్‌లో శంకర్ ఓ హాట్ టాపిక్‌గా మారిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.