యాప్నగరం

సీఎం సొంత నియోజకవర్గంలోనే దారుణం.. ఉత్తమ్ విమర్శలు

Siddipet: రైతు నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Samayam Telugu 30 Jul 2020, 10:54 pm
సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం వేలూరు గ్రామంలో దళితుడైన బ్లాగరి నర్సింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రైతు నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


‘‘సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా? అని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ వారిని బలి తీసుకుంటున్నారని ఉత్తమ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేంత వరకూ దళితులకు న్యాయం జరగబోదని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలని ఈ సందర్భంగా ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.

నర్సింహులకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగులమందు తాగి ఆ‍త్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం 3 గంటలకు నర్సింహులు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.