యాప్నగరం

రైతులకు శుభవార్త చెప్తా అన్నందుకు సిగ్గుపడాలి.. కేసీఆర్‌పై ఉత్తమ్ ధ్వజం

Telangana Congress: కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రూ.లక్ష రుణమాఫీ ఫలాలు ఇప్పటిదాకా రైతులకు అందలేదని, పంటల బీమా లేదని దుయ్యబట్టారు.

Samayam Telugu 30 May 2020, 4:49 pm
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశమంతా ఆశ్చర్యపోయే శుభవార్త చెబుతానని అనడానికి సిగ్గుపడాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఎవరికీ గౌరవం లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమత్తారు. కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రూ.లక్ష రుణమాఫీ ఫలాలు ఇప్పటిదాకా రైతులకు అందలేదని, పంటల బీమా లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడూ సాగు నీరందుతోందని తెలిపారు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy


కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంపైనా ఉత్తమ్ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వందలాది మంది మధ్య ఉండి కూడా సీఎం ముఖాలకు మాస్కులు ధరించలేదని, కనీసం భౌతికదూరం పాటించలేదని విమర్శించారు. స్వయంగా కేసీఆరే కరోనా లాక్ డౌన్ రూల్స్ రూపొందించారని గుర్తు చేశారు. పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువమంది పాల్గొనరాదనే విషయాన్ని గుర్తు చేశారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారని.. నియమనిబంధనలు సామాన్యులకేనా అని ప్రశ్నించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.