యాప్నగరం

దళితులకు రక్షణే లేదు.. వాళ్లని కలిసి ఫిర్యాదు చేస్తాం: ఉత్తమ్

Telangana Congress: దళితులపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్, జాతీయ మానవ హక్కులను కలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.

Samayam Telugu 31 Jul 2020, 10:19 pm
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య దురదృష్టకరమని అన్నారు. రైతు నర్సింహులుకు చెందిన 13 గుంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదిక కోసం తీసుకోవడం వల్లే ఆయన చనిపోయాడని ఆరోపించారు. బాధితులకు ఒక ఎకరం భూమి ఇస్తామని రైతు మరణించించిన తర్వాత మంత్రి హరీశ్ రావు ప్రకటించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


దళితులపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్, జాతీయ మానవ హక్కులను కలుస్తామని తెలిపారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. కొప్పుల ఈశ్వర్ దళిత నాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారని, తప్పుడు ప్రకటనలు చేసి మంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు.

13 శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం ఉండదని ఒకట్రెండు శాతం జనాభా ఉన్న వారికి మాత్రం రెండు లేదా మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయినందుకు ముఖ్యంగా దళితులు, గిరిజనులే కారణమనే విషయం మర్చిపోవద్దని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై ప్రతిరోజు హింసాకాండ జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు నిజాయతీగా ఉన్నా కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితులపై దాడులు జరుగుతున్న ఘటనల్లో న్యాయం జరగడం లేదని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.