యాప్నగరం

తెలంగాణలో బలంగా కాంగ్రెస్.. అందుకు వాళ్లే కారణం: ఉత్తమ్‌

Telangana Congress: గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ అన్నారు. వాళ్లంతా కాంగ్రెస్ వైపే వస్తున్నారని, వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Samayam Telugu 6 Sep 2020, 3:18 pm
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వారు ప్రతిపక్షాన్ని అణచి వేస్తున్నారని విమర్శించారు. ఏ వ్యాఖ్యలు చేసినా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంశాల వారీగా ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని నిర్దేశించారు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ అన్నారు. వాళ్లంతా కాంగ్రెస్ వైపే వస్తున్నారని, వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. నేను మీకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటాను. పార్టీని మరింత బలోపేతం చేద్దాం.’’ అని ఉత్తమ్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఉత్తమ్ అన్నారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో చాలా కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందంటే అందుకు కారణం జిల్లా కాంగ్రెస్ కమిటీలేనని అన్నారు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని అన్నారు. 2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, కేసీఆర్ పాలనపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.