యాప్నగరం

హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ రైలుకు డిమాండ్

Telangana Congress: పార్లమెంటు బయట ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని ఉత్తమ్ గుర్తు చేశారు.

Samayam Telugu 13 Mar 2020, 11:53 am
హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్‌ రైలు నడపాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రాజధానుల మధ్య హై స్పీడ్‌ రైలు నిర్మిస్తే ప్రయాణ వేగం గంటన్నరకు తగ్గుతుందని సూచించారు. ఈ మార్గంలో రోజూ లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల ఆర్థికంగా కూడా కేంద్రానికి లాభదాయకంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Samayam Telugu uttam.


Also Read: ప్రైవేటు బస్సు దగ్ధం.. లోపల 26 మంది ప్రయాణికులు

అనంతరం పార్లమెంటు బయట ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని ఉత్తమ్ గుర్తు చేశారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని.. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ను అత్యంత వేగవంతమైన ట్రాక్‌‌లు ఉన్న ప్రాజెక్టుల్లో చేర్చాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు.

Also Read: లేగ దూడపై అత్యాచార యత్నం.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.