యాప్నగరం

ఉమ్మడి ఏపీలో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి: ఉత్తమ్

Panjagutta: రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

Samayam Telugu 8 Jul 2020, 11:35 am
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఉత్తమ్ కొనియాడారు. వైస్ అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని, దేశ వ్యాప్తంగా వాటిని పాటిస్తున్నారని చెప్పారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒక ల్యాండ్ మార్క్‌ని క్రియేట్ చేశారని ఉత్తమ్ కొనియాడారు. నివాళుల‌ర్పించిన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్ర రావు, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు తదితర నేతలు ఉన్నారు.

Must Read: కేసీఆర్‌కు కరోనా.. దేవుణ్ని ప్రార్థించా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Must Read: కొత్త సచివాలయ డిజైన్ ఎంపిక ఇలా.. ఆ పురాతన భవనమే స్ఫూర్తిగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.