యాప్నగరం

వీహెచ్‌కు బెదిరింపులు.. రేవంత్‌రెడ్డి నుంచి ప్రాణహాని, పీఎస్‌లో ఫిర్యాదు

Telangana Congress: తెలంగాణలో ఖాళీ అయిన పీసీసీ పదవిని భర్తీ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డితోపాటు, రేవంత్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు.

Samayam Telugu 25 Dec 2020, 7:42 pm
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు (వీహెచ్) బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. రేవంత్ గురించి మాట్లాడితే చంపేస్తామంటూ ఎవరో కాల్ చేసి బెదిరించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడని వీహెచ్ ఆరోపించారు. దీంతో వీ హనుమంతరావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన ఆయన ఆ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వీహెచ్ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
Samayam Telugu రేవంత్ రెడ్డి, వీ హనుమంతరావు (ఫైల్ ఫోటోలు)
Revanth Reddy, v hanumanth rao


తెలంగాణలో ఖాళీ అయిన పీసీసీ పదవిని భర్తీ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డితోపాటు, రేవంత్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి అయితే పలుసార్లు ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసి తన ఆసక్తిని తెలియజేశారు. కానీ, ఎక్కువ జనాదరణ ఉన్న నేత, దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డికే ఆ పదవి దక్కవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్‌కు పీసీసీ ఇవ్వడాన్ని వీహెచ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్లను వదిలేసి ఆయనకు పీసీసీ ఇస్తే తాను పార్టీ వదిలిపోతానని శుక్రవారం తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ బెదిరింపు కాల్స్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.