యాప్నగరం

కరోనా వ్యాక్సిన్‌కు మరో 3-4 నెలలు పట్టే అవకాశం: డీఎంఈ

Telangana Coronavirus: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంపైనా రమేశ్ రెడ్డి స్పందించారు. వ్యాక్సిన్ తెలంగాణలో అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని వివరించారు.

Samayam Telugu 18 Oct 2020, 4:20 pm
పండుగల వేళ తెలంగాణ ప్రజలు కరోనా బారి నుంచి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి సూచించారు. ఈ సమయంలో ప్రజలు అత్యధికంగా ప్రయాణాలు, బంధుమిత్రులను కలవడం వంటివి చేస్తుంటారని, ఈ క్రమంలో అందరూ జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 350 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona vaccine


కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంపైనా రమేశ్ రెడ్డి స్పందించారు. వ్యాక్సిన్ తెలంగాణలో అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని వివరించారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఉంచిన పునరావాస కేంద్రాల్లోనూ కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. ఈ వానాకాలంలో పరిశుభ్రత లేకపోతే సీజనల్ వ్యాధుల ముప్పు తప్పదని వివరించారు. కలుషితమైన నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని రమేశ్ రెడ్డి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.