యాప్నగరం

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Wanaparthy: ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 16 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 7 Mar 2020, 12:38 pm
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్, ఆటో పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 16 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu accident


Must Read: కరోనా ఎఫెక్ట్: మంత్రి ఈటలకు రూ.8 కోట్లు నష్టం

Also Read: ఆఫీసులోనే స్నానం చేసి రండి.. మంత్రికి ఆయన భార్య ఆదేశం

శనివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నగరలోని చాదర్ ఘాట్ ప్రాంతం నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. బండ్లగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోఠి నుంచి గౌరెల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: నకిలీ విజయ్ దేవరకొండ.. లీలలు తెలిస్తే షాక్! పట్టుకున్న పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.