యాప్నగరం

తెలంగాణ డాక్టర్ చొరవ‌కు ఉపరాష్ట్రపతి ఫిదా

Telangana Coronavirus: ‘‘కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన డాక్టర్ పెండ్యాల శ్రీరాం గారి చొరవను అభినందిస్తున్నాను.’’ అని ట్వీట్ చేశారు.

Samayam Telugu 14 Jul 2020, 11:45 pm
కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించిన తెలంగాణకు చెందిన డాక్టర్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ఈ మేరకు వెంకయ్య ట్విటర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా మృతుడి భౌతికకాయం శ్మశానానికి తరలించేందుకు మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవర్ నిరాకరించడంతో డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఆయన చొరవను అభినందిస్తున్నానని ట్విటర్‌లో ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. శ్రీరామ్ చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తి కావాలని అభిలషించారు.
Samayam Telugu వెంకయ్య నాయుడు
Venkaiah naidu


‘‘కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా (తెలంగాణ) కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాం గారి చొరవను అభినందిస్తున్నాను.’’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

Must Read: నిజాం రహస్య నిధుల కోసమే సచివాలయం కూల్చివేత.. రేవంత్ సంచలన ఆరోపణలు

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ కరోనా మరణం జరిగింది. అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో ప్యాక్ చేసిన ఆ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిరాకరించాడు. ఆ మృతదేహాన్ని తీసుకెళ్తే తనకు కూడా కరోనా సోకుతుందేమో అని భయపడ్డాడు. ఈ విషయాన్ని సిబ్బంది డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌కు చెప్పారు. దీంతో వెంటనే డాక్టర్ పీపీఈ కిట్ ధరించి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు. అనంతరం స్పందించిన ఆయన తాను కేవలం డాక్టర్‌ను మాత్రమే కాదని, తాను ప్రజా సేవకుడినని చెప్పారు. వారికి సేవ చేయడం కోసమే ప్రభుత్వం తనను నియమించుకుందని అభిప్రాయపడ్డారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.