యాప్నగరం

హైదరాబాద్‌లోనే ఉప రాష్ట్రపతి వెంకయ్య దీపావళి వేడుకలు

Diwali 2020: దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లేనని.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా కంకణబద్ధులమవుదామని ట్వీట్ చేశారు.

Samayam Telugu 14 Nov 2020, 9:59 pm
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈసారి దీపావళి వేడుకలను హైదరాబాద్‌లోనే జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే ఆయన కుమారుడి ఇంట్లోనే దీపాలు వెలిగించారు. భార్య ఉషా నాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లేనని.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని వెంకయ్య ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకొనే ఈ దీపావళి స్ఫూర్తితో అందరం ఆత్మస్థైర్యాన్ని పొందాలని అన్నారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా కంకణబద్ధులమవుదామని ట్వీట్ చేశారు.
Samayam Telugu దీపావళి వేడుకల్లో వెంకయ్య కుటుంబం
venkaiah naidu celebrates diwali


‘‘ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టుగా ఈసారి దీపావళి సందర్భంగా జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారి కోసం ఒక దీపాన్ని వెలిగించి వారికి సంఘీభావాన్ని తెలియజేద్దాం’’ అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ‘‘దీపం జ్యోతి పరఃబ్రహ్మ.. దీపం సర్వతమోపహమ్.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీపం నమోస్తుతే’’ అని ప్రార్థించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.