యాప్నగరం

పాల ధరలు పెరిగాయ్.. లీటర్‌కు రూ.2 పెంచిన విజయ మిల్క్

తెలంగాణలో విజయ పాల ధరలు పెరిగాయ్. లీటర్‌కు రూ.2 చొప్పున పాల ధరలు పెంచుతూ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది అభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది.

Samayam Telugu 15 Dec 2019, 11:17 pm
తెలంగాణలో విజయ పాలధరలు పెరిగాయ్. విజయపాల ధర పెంచాలని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది అభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్) నిర్ణయించింది. సోమవారం నుంచి లీటరుకు రూ.2 చొప్పున పాలధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతుల దగ్గర్నుంచి సేకరిస్తోన్ పాల ధరలు పెరగడంతో.. పాల విక్రయ ధరలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ తెలిపింది. స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని యాజమాన్యం పేర్కొంది.
Samayam Telugu vijaya milk


పెరిగిన పాల ధరల నేథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు, బేస్ మార్జిన్‌ను రూ. 3.25 పైసలు పెంచినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.42కు లభిస్తుండగా.. సోమవారం నుంచి మార్కెట్లో రూ.44కు లభించనుంది.

పెంచిన విజయ పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలేనని, తల్లిపాలు అందుబాటులో లేని పసికందులు పోతపాల మీద ఆధార పడుతున్నారని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. పాల ధరలను పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలకు దూరం అవుతారని ఆయన అన్నారు.

అమూల్ మిల్క్ కూడా అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 15 నుంచి లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లీటర్ పాలకు రూ.3 చొప్పున ధర పెంచుతూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.