యాప్నగరం

తలతిక్క సీఎం కేసీఆర్ పిచ్చి నిర్ణయంతో తీరని నష్టం.. విజయశాంతి ఘాటు ట్వీట్

Telangana BJP: సీఎం నిర్ణయంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఆయన నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఆదివారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తలతిక్కగా ఉందని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 27 Dec 2020, 10:41 pm
నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు నిధులు విడుదల చేస్తామంటూ తేల్చి చెప్పారు. కానీ, తాజాగా ఆ విధానం అవలంబించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం వెలువరించారు. దీంతో ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Samayam Telugu కేసీఆర్, విజయశాంతి (ఫైల్ ఫోటోలు)
kcr vijayashanti


ఈ నిర్ణయం వెలువరించిన కాసేపటికే బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. సీఎం నిర్ణయంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఆయన నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఆదివారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తలతిక్కగా ఉందని ఎద్దేవా చేశారు.

‘‘నియంత్రిత సాగు నిర్ణయంతో నష్టపోయిన రైతులకు ఎవరు బాధ్యులు? తల తిక్క ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయంతో తీరని నష్టం జరిగింది. ఎన్నో వైఫల్యాల తుగ్లక్ పాలనలో ఇది మరో ప్రహసనం. ఇప్పుడు రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నప్పుడు రైతు బంద్ పెట్టి ఎందుకు సతాయించావు?’’ అని విజయశాంతి సూటిగా ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.