యాప్నగరం

కేసీఆర్ పగ వల్లే ఇదంతా.. విజయశాంతి మండిపాటు

Telangana BJP: విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. కొత్త ప్రయోగాలు చేపడుతూ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకొనే కార్యక్రమాలను సీఎం చేపడుతున్నారని విజయశాంతి విమర్శించారు.

Samayam Telugu 5 Jan 2021, 9:58 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల పాలిట రాబందులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. కొత్త ప్రయోగాలు చేపడుతూ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకొనే కార్యక్రమాలను సీఎం చేపడుతున్నారని విజయశాంతి విమర్శించారు.
Samayam Telugu విజయశాంతి, బండి సంజయ్
Vijayashanti, bandi sanjay


‘‘తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు... రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా... సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో... తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే... ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.’’ అని విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.