యాప్నగరం

రేపే బీజేపీలోకి విజయశాంతి.. ఆ సమయం కోసమే వెయిటింగ్

GHMC: ఇప్పటికే విజయశాంతి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇచ్చే విషయంపై ఆమె నడ్డాతో చర్చించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 28 Nov 2020, 5:26 pm
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ జోరుగా ప్రచారంలో దూసుకుపోతోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఛరిష్మా ఉన్న నాయకులు పార్టీలో చేరితే బల్దియాలో మరిన్ని స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రయత్నిస్తున్నారు. అంతేకాక, జాతీయ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె కూడా బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తితోనే ఉన్నారు. ఆమె పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. అయితే, ఆమె పార్టీ మారే ముహూర్తమే ఇంకా ఖరారు కాలేదు.
Samayam Telugu విజయశాంతి
Vijayashanthi


కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో కూడా సమావేశమైన విషయం తెలిసిందే. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన తొలుత హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విజయశాంతి ఆయన సమక్షంలో బీజేపీలో చేరతారు.

ఇప్పటికే విజయశాంతి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇచ్చే విషయంపై ఆమె నడ్డాతో చర్చించినట్లు తెలుస్తోంది. నడ్డా నుంచి ఆమె హామీ తీసుకున్నట్లు చెబుతున్నారు. విజయశాంతి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దుబ్బాక శాసన సభ ఉప ఎన్నికలోనూ ప్రచారం చేయలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాత్రం విమర్శలు ఆపలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.