సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్న ఈ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గులాబీ పార్టీ ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ను దింపనున్నట్లు రాష్ట్ర అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన విజయశాంతితో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయించనున్నట్లు ప్రచారం బాగా సాగుతోంది.
Must Watch: వీడియో: కళ్లు జిగేల్మనేలా Hyd కేబుల్ బ్రిడ్జి.. రాత్రిపూట డ్రోన్ విజువల్స్.. డోంట్ మిస్
నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ..
దుబ్బాక స్థానాన్ని చివరిసారిగా 2009లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో మంత్రిగా కూడా పని చేసిన ఆయన తర్వాత కాంగ్రెస్ను వీడారు. అప్పటి నుంచి పార్టీకి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదు. ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడూ లేడు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్కు సరైన అభ్యర్థి లేడు. అయినా ఆ పార్టీ రెండో స్థానం కైవసం చేసుకుంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విజయశాంతి కేసీఆర్పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ వ్యతిరేకతే కాంగ్రెస్కు బలం!
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ నుంచి రఘునందన్ రావు మినహా పెద్ద నేతలెవరూ లేరు. మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబం పోటీ చేయడాన్ని స్థానిక టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే మరింత వ్యతిరేకత పెరుగుతుంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్లో ఉన్న ఈ లోపం, కరోనా విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనాలు వేస్తోంది. అంతేకాక, కాంగ్రెస్కు గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తల బలం విజయశాంతి ఇమేజ్ తమకు కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు.
Must Read: undefined
Also Read: Hyd మెట్రో పున:ప్రారంభానికి ఏర్పాట్లు.. కొత్త నిబంధనలివే.. వీళ్లకి నో ఎంట్రీ
దుబ్బాక ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ను దింపనున్నట్లు రాష్ట్ర అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన విజయశాంతితో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయించనున్నట్లు ప్రచారం బాగా సాగుతోంది.
Must Watch: వీడియో: కళ్లు జిగేల్మనేలా Hyd కేబుల్ బ్రిడ్జి.. రాత్రిపూట డ్రోన్ విజువల్స్.. డోంట్ మిస్
నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ..
దుబ్బాక స్థానాన్ని చివరిసారిగా 2009లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో మంత్రిగా కూడా పని చేసిన ఆయన తర్వాత కాంగ్రెస్ను వీడారు. అప్పటి నుంచి పార్టీకి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదు. ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడూ లేడు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్కు సరైన అభ్యర్థి లేడు. అయినా ఆ పార్టీ రెండో స్థానం కైవసం చేసుకుంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విజయశాంతి కేసీఆర్పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ వ్యతిరేకతే కాంగ్రెస్కు బలం!
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ నుంచి రఘునందన్ రావు మినహా పెద్ద నేతలెవరూ లేరు. మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబం పోటీ చేయడాన్ని స్థానిక టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే మరింత వ్యతిరేకత పెరుగుతుంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్లో ఉన్న ఈ లోపం, కరోనా విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనాలు వేస్తోంది. అంతేకాక, కాంగ్రెస్కు గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తల బలం విజయశాంతి ఇమేజ్ తమకు కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు.
Must Read: undefined
Also Read: Hyd మెట్రో పున:ప్రారంభానికి ఏర్పాట్లు.. కొత్త నిబంధనలివే.. వీళ్లకి నో ఎంట్రీ